AFC Womens Asian Cup 2022: నేటి నుంచి ఆసియా కప్‌ టోర్నీ.. 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత..

20 Jan, 2022 11:43 IST|Sakshi

43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ మహిళల ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. 12 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్‌ నేడు ముంబైలో మొదలుకానుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న భారత్‌ నేడు  ఇరాన్‌తో తలపడుతుంది. ఇరాన్‌తో గతంలో మూడుసార్లు ఆడిన భారత్‌ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌ రెండుసార్లు రన్నరప్‌గా (1979, 1983) నిలిచింది.

మరిన్ని వార్తలు