CWG 2022 Mens Doubles Table Tennis: రజతంతో సరిపెట్టుకున్న శరత్‌ కమల్‌-జ్ఞానశేఖరన్‌ జోడీ

7 Aug, 2022 21:32 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్‌ టేబుల్‌ టెన్నిస్‌ డబుల్స్‌ జోడీ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో అచంట శరత్‌ కమల్‌-జ్ఞానశేఖరన్‌ సతియాన్‌ ద్వయం.. ఇంగ్లండ్‌ జోడీ లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌-పాల్‌ డ్రింక్‌హాల్‌ చేతిలో ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లీష్‌ జోడీ 8-11, 11-8, 11-3, 7-11, 11-4తేడాతో భారత ద్వయంపై విజయం సాధించి స్వర్ణ పతకం ఎగరేసుకుపోయింది.

2018 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ ఇంగ్లండ్‌ జోడీ.. భారత జోడీపై దాదాపు ఇదే తరహాలో విజయం సాధించింది. నాడు డిసైడింగ్‌ గేమ్‌లో ఇంగ్లండ్‌ 11-8 తేడాతో నెగ్గగా.. ఇప్పుడు 11-4 తేడాతో విజయం​ సాధించింది. టీటీలో శరత్‌ కమల్‌-జ్ఞానశేఖరన్‌ జోడీ సాధించిన పతకంతో భారత పతకాల సంఖ్య 49కి (17 స్వర్ణాలు, 13 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. ఇవాళ ఒక్క రోజే భారత్‌ ఖాతాలో 9 పతకాలు చేరాయి. 
చదవండి: పసిడి పంచ్‌ విసిరిన తెలంగాణ బిడ్డ.. అభినందనలతో ముంచెత్తిన కేసీఆర్‌

మరిన్ని వార్తలు