అమితాబ్‌కు ‘గోల్డెన్‌ టికెట్‌’

6 Sep, 2023 03:30 IST|Sakshi

భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌నకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ‘గోల్డెన్‌ టికెట్‌’ను నట దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌కు బీసీసీఐ కార్యదర్శి జై షా అందజేశారు. ఈ టికెట్‌ ద్వారా ప్రత్యేక అతిథి హోదాలో అన్ని వేదికల్లో అన్ని మ్యాచ్‌లనూ చూసే అవకాశం ఉంటుంది. మహానటుడే కాకుండా క్రికెట్‌ వీరాభిమాని అయిన అమితాబ్‌కు ‘గోల్డెన్‌ టికెట్‌’ ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు, ఎప్పటిలాగే టీమిండియాకు ఆయన మద్దతు కొనసాగాలని జై షా వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు