రాణించిన త్రిష: హైదరాబాద్‌ ఘనవిజయం

21 Oct, 2023 01:15 IST|Sakshi

బీసీసీఐ సీనియర్‌ మహిళల టి20 టోర్నీ లో శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘ఇ’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 83 పరుగులతో ఒడిషాను ఓడించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. గొంగడి త్రిష (54 బంతుల్లో 72; 11 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగింది. అనంతరం ఒడిషా 16.5 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. 

మరిన్ని వార్తలు