Surya Kumar Yadav: రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో నిన్న (జనవరి 7) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా 91 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను హార్ధిక్ సేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ సునామీ శతకం (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) ధాటికి నిశ్చేష్టులుగా మిగిలిపోయిన లంకేయులు మ్యాచ్లో పాటు సిరీస్ను భారత్ చేతికి అప్పజెప్పారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే శతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగితే శుభ్మన్ గిల్ (36 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) తమ పాత్రలను న్యాయం చేశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులు భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్, చహల్ తలో 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
కాగా, ఈ మ్యాచ్లో సూర్యకుమార్ విధ్వంసకర శతకం సాధించే క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే..
పొట్టి క్రికెట్ చరిత్రలో మూడు వేర్వేరు ఖండాల్లో (ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్) శతకాలు సాధించిన అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకున్న సూర్యకుమార్.