IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20.. భారత జట్టు ఇదే! విధ్వంసకర ఓపెనర్‌కు నో ఛాన్స్‌?

9 Dec, 2023 16:05 IST|Sakshi

దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు తొలి పరీక్షకు సిద్దమైంది. ఆదివారం డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌తో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఇప్పటికే డర్బన్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.

కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన టీమిండియా ఆటగాళ్లు శుబ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్ ప్రోటీస్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. దీంతో తొలి టీ20 తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి రావడంతో తొలి మ్యాచ్‌కు యశస్వీ జైశ్వాల్‌పై వేటు వేయాలని జట్టు మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. భారత ఇన్నింగ్స్‌ను రుతురాజ్‌ గైక్వాడ్‌, గిల్‌ ప్రారంభించే ఛాన్స్‌ ఉంది. ఫస్ట్‌ డౌన్‌లో శ్రేయస్‌ అ‍య్యర్‌, రెండో స్ధానంలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌కు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.

అదే విధంగా తిలక్‌ వర్మ సైతం బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్‌ ఉంది. ఇక వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ స్ధానానికి ఎటువంటి ఢోకా లేదు. కానీ అతడు ఏ స్ధానంలో బ్యాటింగ్‌ వస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మొదటి స్ధానంలో వెటరన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో ముఖేష్‌ కుమార్‌, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.

సౌతాఫ్రికాతో తొలి టీ20 భారత జట్టు(అంచనా): రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రింకు సింగ్, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా,ముఖేష్‌ కుమార్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
>
మరిన్ని వార్తలు