కిరణ్‌ జార్జికి సింగిల్స్‌ టైటిల్‌ 

11 Sep, 2023 02:22 IST|Sakshi

భారత బ్యాడ్మింటన్‌ రైజింగ్‌ స్టార్‌ కిరణ్‌ జార్జి తన కెరీర్‌లో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. జకార్తాలో ఆదివారం ముగిసిన ఇండోనేసియా ఓపెన్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 టోరీ్నలో 23 ఏళ్ల కిరణ్‌ జార్జి విజేతగా నిలిచాడు. కేరళకు చెందిన కిరణ్‌ జార్జి ఫైనల్లో 21–19, 22–20తో జపాన్‌కు చెందిన ప్రపంచ 82వ ర్యాంకర్‌ కూ తకహాíÙపై గెలుపొందాడు. కిరణ్‌ జార్జికు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

మరిన్ని వార్తలు