-

SAFF Championship: గెలిస్తేనే భారత్‌ ఫైనల్‌కు... 

13 Oct, 2021 07:24 IST|Sakshi

The South Asian Football Federation Championship Championship: దక్షిణాసియా (శాఫ్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఫైనల్‌కు చేరాలంటే నేడు మాల్దీవులు జట్టుతో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో సునీల్‌ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు తప్పనిసరిగా గెలవాలి. ఓటమి లేదా ‘డ్రా’ చేసుకుంటే భారత్‌ ఇంటిదారి పడుతుంది. ప్రస్తుతం మాల్దీవులు, నేపాల్‌ ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... భారత్‌ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. టాప్‌–2 జట్లు మాత్రమే ఫైనల్‌కు చేరుతాయి. 

చదవండి: T20 World Cup 2021: మెంటార్‌గా ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు..
IPL 2021: స్విమ్మింగ్‌ఫూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్ల జల్సా..

మరిన్ని వార్తలు