ఐసీసీ అవార్డు గెలుచుకున్న సంచలన ఫాస్ట్‌ బౌలర్‌

13 Feb, 2024 17:00 IST|Sakshi

బౌలింగ్‌ సంచలనం, విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షమార్‌ జోసఫ్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు (2024 జనవరి) దక్కించుకున్నాడు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను షమార్‌ ఈ అవార్డు గెలుచుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ పోటీపడినప్పటికీ.. విండీస్‌ సంచలన బౌలర్‌నే అవార్డు వరించింది. వివిధ పద్దతుల్లో జరిగిన ఓటింగ్‌లో అత్యధిక శాతం‌ ఓట్లు  షమార్‌కే దక్కాయి.

మహిళల విషయానికొస్తే.. ఈ విభాగంలో జనవరి నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును అమీ హంట‌ర్(ఐర్లాండ్) దక్కించుకుంది. గత నెలలో అద్భుత ప్రదర్శనల నేపథ్యంలో అమీ హంటర్‌ ఈ అవార్డుకు ఎంపికైంది. అమీతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కోసం బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. 

కాగా, షమార్‌ జోసఫ్‌ గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ విండీస్‌ యువ పేసర్‌ తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు. 

ఈ పర్యటనలో ఆసీస్‌ బ్యాటర్లను గడగడలాడించిన షమార్‌ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో షమార్‌ విశ్వరూపం​ (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్‌ 30 ఏళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై టెస్ట్‌ విజయాన్ని నమోదు చేసింది.  

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega