Tata Open Maharashtra: రామ్‌కుమార్‌ శుభారంభం

1 Jan, 2023 05:45 IST|Sakshi

టాటా ఓపెన్‌ మహారాష్ట్ర ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో భారత ప్లేయర్లు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్‌ రామనాథన్‌లు మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందడానికి విజయం దూరంలో నిలిచారు.

పుణేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో యూకీ 6–2, 6–2తో డీగో హిడాల్గో (ఈక్వెడార్‌)పై గెలుపొందగా... రామ్‌కుమార్‌ 2–6, 7–5, 6–2తో ప్రపంచ 175వ ర్యాంకర్‌ ఒటో విర్టానెన్‌ (ఫిన్‌లాండ్‌)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు