Zimbabwe vs India ODI series: చహర్‌ పునరాగమనం

31 Jul, 2022 05:57 IST|Sakshi

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు భారత జట్టు

ముంబై: జింబాబ్వే గడ్డపై జరిగే 3 వన్డేల సిరీస్‌ కోసం భారత టీమ్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ శనివారం ప్రకటించింది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన దీపక్‌ చహర్, వాషింగ్టన్‌ సుందర్‌ కోలుకొని పునరాగమనం చేయగా, రాహుల్‌ త్రిపాఠిని తొలిసారి వన్డేలకు ఎంపిక చేశారు.

రోహిత్, కోహ్లి, పంత్, షమీ, బుమ్రా, హార్దిక్‌ ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకోగా... రొటేషన్‌ పాలసీలో భాగంగా ఇతర కీలక ఆటగాళ్లు శ్రేయస్, సూర్యకుమార్, జడేజా, చహల్, అర్‌‡్షదీప్‌లను కూడా ఈ టూర్‌కు పంపరాదని సెలక్టర్లు నిర్ణయించారు. కరోనా బారిన పడిన కేఎల్‌ రాహుల్‌ కోలుకోకపోవడంతో ఎంపిక చేయలేదు.    

జట్టు వివరాలు: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శుబ్‌మన్‌ గిల్, హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్, సామ్సన్, సుందర్, శార్దుల్, అక్షర్, కుల్దీప్, అవేశ్, ప్రసిధ్, సిరాజ్,  దీపక్‌ చహర్‌. 

మరిన్ని వార్తలు