-
సమంతకు రీ ఎంట్రీలోనే బిగ్ ఆఫర్..!
కోలీవుడ్ సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ వేడి వేడిగా వినిపిస్తున్న పేరు విజయ్. ఇందుకు కారణం అందరికీ తెలిసిందే. సినీ రంగంలో టాప్ హీరోగా రాణిస్తున్న విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, మైక్ మోహన్, అజ్మహల్, జయరామ్, ప్రేమ్జీ, వైభవ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సరదాగా జరుగుతోంది. దీంతో విజయ్ తన 69వ చిత్రానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే ఈయన చివరి చిత్రం అవుతుంది అని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా ఇది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ లిస్టులో దర్శకుడు అట్లీ, వెట్రిమారన్, కార్తీక్ సుబ్బరాజ్, ఆర్జే బాలాజీ,హెచ్ వినోద్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఇందులో కార్తీక్ సుబ్బరాజు గానీ, ఆర్జే బాలాజీ గానీ, విజయ్ 69 చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ఇందులో విజయ్ సరసన నటించే నటి ఎవరన్నది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటి సమంతను నాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కాలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజమైతే నటి సమంత విజయ్తో జతకట్టే నాలుగో చిత్రం ఇది అవుతుంది. ఇంతకుముందు మెర్సల్, తేరి చిత్రాల్లో సమంత నటుడు విజయ్తో జత కట్టారు అన్నది గమనార్హం. లేకపోతే ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత ఆ తర్వాత కథానాయకిగా నటించే భారీ దక్షిణాది చిత్రం ఇదే అవుతుంది. -
కేసీఆర్ గ్రాండ్ బర్త్ డే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వచ్చే నెల నుంచి పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకం కానున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా జనంలోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేర కు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న కేసీఆర్ వచ్చేనెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయనకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కోలుకుంటున్న కేసీఆర్: ఎర్రవల్లి ఫామ్హౌస్లో గత నెల 8న తుంటి ఎముక గాయంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ప్రస్తుతం నందినగర్లోని తన నివాసంలో కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు పరిమిత సంఖ్యలోనే సన్నిహితులు, పార్టీ నాయకులు ఆయన్ను కలుస్తున్నారు. మరో మూడు నుంచి నాలుగు వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ను స్వయంగా పరామర్శించేందుకు గత నెల రోజులుగా పార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండగా, కేడర్ కూడా అధినేతను చూసేందుకు ఎదురు చూస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది. ఈ నెల 3నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లోక్సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రీ ఎంట్రీ పారీ్టకి మరింత జోష్ తెస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్వాగత సన్నాహాలు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్షేత్ర స్థాయిలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. జంట నగరాల్లో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొలిసారిగా జనం మధ్యకు వస్తుండటంతో ఆ మేరకు ఘనంగా స్వాగత సన్నాహాలు చేయాలని పార్టీ భావిస్తోంది. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ కాన్వాయ్తో కేసీఆర్ను తోడ్కొనిరానున్నారు. మరోవైపు కేసీఆర్ను వ్యక్తిగతంగా కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వందల సంఖ్యలో ముఖ్య నేతలు హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ నేతలు, కేడర్ను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. వచ్చే నెల 20 తర్వాత గజ్వేల్కు.. గజ్వేల్ ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా గెలుపొందిన కేసీఆర్ వచ్చే నెల 20 తర్వాత నియోజకవర్గ పర్యటనకు వెళ్లే అవకాశముంది. ఇకపై రెగ్యులర్గా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కేడర్కు అందుబాటులో ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా గజ్వేల్లో కూడా భారీగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయనున్నారు. తొలి పర్యటనలో నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభివృద్ధి పనులపైనా అధికారులతో చర్చిస్తారని సమాచారం. వరంగల్లో భారీ బహిరంగ సభ! పార్టీ కార్యకలాపాలను ఇకపై తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక కూడా ఇక్కడే జరపనున్నారు. పార్టీ కార్యాలయంలోనే నాయకులు, కేడర్తో వరుస భేటీలు జరిపేందుకు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 22న పార్టీ లోక్సభ సన్నాహక సమావేశాలు ముగియనుండగా, ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ ఇదే తరహా మీటింగ్లు జరగనున్నాయి. ఒకవైపు విశ్రాంతి తీసుకుంటూనే మరోవైపు వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడుతూ క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఉద్యమ కాలంలో తనతో కలిసి పనిచేసిన వివిధ వర్గాలకు చెందిన నేతలతోనూ మాట్లాడుతూ త్వరలో అందుబాటులో ఉంటానని చెప్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అనేకమార్లు తేదీలు ప్రకటించినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో లోక్సభ ఎన్నికల షెడ్యూలు వెలువడేలోపు బీఆర్ఎస్ సత్తాను చాటేలా అక్కడ భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. -
TS: గులాబీ బాస్ గ్రాండ్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ వెంటనే తుంటి ఎముకకు సర్జరీతో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 17న తన పుట్టినరోజును పురస్కరించుకుని గులాబీ బాస్ మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పుట్టినరోజు నాడే కేసీఆర్ హైదరాబాద్లోని బీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ తెలంగాణ భవన్కు రానున్నారని సమాచారం. బాస్ రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. పుట్టినరోజు నాడు కేసీఆర్ తిరిగి తెలంగాణ భవన్కు రానుండటంతో భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. బాస్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్ రీ ఎంట్రీ తర్వాత తొలుత సొంత నియోజకవర్గమైన గజ్వేల్కు కేసీఆర్ భారీ కాన్వాయ్తో వెళ్లనున్నారు. అక్కడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్లోని తెలంగాణ భవన్, గజ్వేల్ క్యాంప్ ఆఫీసు వేదికగా కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. తాను త్వరలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికలకు ముందే వరంగల్లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతల సిద్ధమవుతున్నారు. ఇటీవల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ చీఫ్ కేసీఆర్ రీ ఎంట్రీపై హింట్ ఇచ్చారు. త్వరలో కేసీఆర్ తెలంగాణభవన్లో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు కూడా వెళ్తారని వెల్లడించారు. తుంటి ఎముకకు సర్జరీ కారణంగా ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశాలకు రాలేకపోయిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. దీంతో రీ ఎంట్రీలో కొత్త ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి పాలనపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఇదీచదవండి.. మేమూ రామ భక్తులమే : మంత్రి ఉత్తమ్ -
భారత్లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
మళ్లీ వార్తల్లోకి వచ్చిన రజనీకాంత్ రెండవ కూతురు
కోలీవుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య ఆరేళ్ల తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ వారసురాళ్లు ఐశ్వర్య, సౌందర్య ఇద్దరు దర్శకులుగా కొనసాగుతున్నారన్నది తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య నటుడు విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా లాల్ సలాం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) కాగా రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య ఇంతకుముందు తన తండ్రి కథానాయకుడిగా కొచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదేవిధంగా రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన పలు చిత్రాలకు ఈమె గ్రాఫిక్స్ డిజైనర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ధనుష్ కథానాయకుడిగా నటించిన వేలైయిల్లా పట్టాదారి చిత్రానికి ఈమెనే దర్శకురాలు. కాగా ఆరేళ్ల తరువాత సౌందర్య రజనీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈసారి ఆమెజాన్ ప్రైమ్ టైం కోసం రూపొందించబోతున్నారని, ఇందులో నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఓం రౌత్ను ప్రభాస్ డైలాగ్తోనే ఆడుకుంటున్న నెటిజన్లు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement