-
ధోనితో వాదించిన రుతురాజ్.. ఎవరి ఆదేశాలు పాటించాలి?
'I've to look at both Dhoni and Ruturaj for instructions: గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చహర్. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(21), కెప్టెన్ శుబ్మన్ గిల్(8) రూపంలో రెండు కీలక వికెట్లు తీసి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెపాక్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 28 పరుగులే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్తో మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సీఎస్కే అదరగొట్టిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ను 143 పరుగులకే కట్టడి చేసి.. 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం దీపక్ చహర్ జియో సినిమాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ నుంచి చహర్కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘బౌలింగ్ చేసేటపుడు నువ్వు ధోనితో చర్చిస్తావా? లేదంటే గైక్వాడ్తోనా? ఆదేశాల కోసం ఎవరివైపు చూస్తావు?’ అని గావస్కర్ అడిగాడు. ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కావడం లేదు ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఇప్పుడు మహీ భాయ్, రుతురాజ్.. ఇద్దరి వైపూ చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి మహీ భాయ్ను చూడాలా లేదంటే రుతురాజ్ను చూడాలా అన్నది అర్థం కావడం లేదు. ఆ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఏదేమైనా రుతురాజ్ తనదైన శైలిలో సమర్థవంతంగానే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు’’ అని దీపక్ చహర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్కరోజు ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న ధోని.. పగ్గాలను రుతురాజ్కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో మాత్రం ధోని జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. కొత్త నిబంధనలు మాకే ఉపయోగకరం ఈ క్రమంలో గుజరాత్తో మ్యాచ్లో రుతురాజ్ ధోనితో వాదించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 సందర్భంగా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల గురించి మాట్లాడుతూ.. ‘‘సీఎస్కేకు ఆడుతున్న తొలినాళ్ల నుంచే పవర్ ప్లేలో నేను మూడు ఓవర్లు బౌల్ చేస్తున్నా. కొత్త నిబంధనలకు అనుగుణంగానే నా ఆట తీరులో మార్పు చేసుకుంటున్నా. గతంలో ఆరంభ ఓవర్లోనే 2-3 బౌన్సర్లు వేస్తే.. ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ బాల్ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉండేవారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఒక ఓవర్లో కేవలం రెండు బౌన్సర్లకే అనుమతినిచ్చారు. పేసర్లకు ఈ రూల్ అనుకూలంగా ఉంది. పెద్దగా తేమ లేని వికెట్పై బంతిపై గ్రిప్ సాధించేందుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని చహర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మెరుపు అర్ధ శతకం(23 బంతుల్లో 51)తో చెలరేగిన సీఎస్కే ఆల్రౌండర్ శివం దూబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: #Rohit Sharma: రోహిత్ శర్మ ఫ్లైయింగ్ కిస్.. ఫొటోలు డిలీట్ చేసిన సన్రైజర్స్ -
IPL 2024: ‘ధోని ఇంకో రెండేళ్లు ఆడతాడు’
IPL 2024- Is this MS Dhoni's last IPL season?: మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్-2024 సీజన్లో ఆడతాడా? లేదా? తలా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈసారి కొత్త పాత్రలో నేను అంటూ ధోని కూడా టీజ్ చేయడంతో ఆటగాడిగా జట్టు నుంచి నిష్క్రమిస్తాడా అనే సందేహాలు మరింత బలపడ్డాయి. తాజా ఎడిషన్లో మెంటార్గా ధోని కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే ఆల్రౌండర్ దీపక్ చహర్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో సంతోషాన్ని నింపాయి. ‘‘ధోని ఈసారి కచ్చితంగా ఆడతాడు. నాకు తెలిసి ఈ సీజన్ ముగిసిన తర్వాతే ఇక ముందు ఆడాలా? వద్దా అనే నిర్ణయం తీసుకుంటాడు. నా అభిప్రాయం ప్రకారం అయితే.. ధోని మరో రెండేళ్లపాటు ఆడతాడు. బ్యాటర్లైనా, బౌలర్లైనా తమ ఆటలో పస తగ్గినపుడే రిటైర్ అవ్వాలని భావిస్తారు. మరి.. గతేడాది ఎంఎస్ ధోని ఎలాంటి షాట్లు బాదాడో చూశారు కదా! గంటకు 145 కిలో మీటర్ల వేగంతో సిక్స్లు కొట్టాడు. నెట్స్లోనూ భారీ షాట్లతో అలరించాడు’’ అని ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దీపక్ చహర్ పేర్కొన్నాడు. కాగా 42 ఏళ్ల ధోని గతేడాది సీఎస్కేను రికార్డు స్థాయిలో ఐదోసారి చాంపియన్గా నిలిపాడు. ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ ఐపీఎల్ టి20 టోర్నీ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాటర్, న్యూజిలాండ్కు చెందిన డెవాన్ కాన్వే ఐపీఎల్ టోర్నీకి దూరం కానున్నాడు. ఇటీవల కాన్వే ఎడమ బొటన వేలికి గాయంకాగా, ఈ వారంలో అతనికి శస్త్ర చికిత్స జరగనుంది. కాన్వే కోలుకోవడానికి కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఐపీఎల్లో 23 మ్యాచ్లు ఆడిన కాన్వే 9 అర్ధ సెంచరీలతో కలిపి 141.28 స్ట్రయిక్రేట్తో 924 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2024: ఆ జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేదంటే సిగ్గుచేటే! -
Ind vs SA: ఆఖరి రెండు వన్డేలకు అయ్యర్ దూరం.. కారణమిదే
India’s updated ODI squad Vs SA 2023: సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ ట్రోఫీని ఆతిథ్య జట్టుతో పంచుకున్న టీమిండియా తదుపరి వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది. జొహన్నస్బర్గ్ వేదికగా ఆదివారం(డిసెంబరు 17) నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. స్టార్ పేసర్ దీపక్ చహర్ ఈ సిరీస్కు దూరం కానున్నట్లు శనివారం వెల్లడించింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు సౌతాఫ్రికాకు వెళ్లడం లేదని తెలిపింది. అతడి స్థానాన్ని ఆకాశ్ దీప్తో భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. శ్రేయస్ అయ్యర్ దూరం అదే విధంగా శ్రేయస్ అయ్యర్ సైతం ఆఖరి రెండు వన్డేలకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రెండు, మూడో మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలిపింది. కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ఈ వన్డే సిరీస్లో కేఎల్ రాహుల్ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సఫారీ గడ్డపై టీమిండియా ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ రెండు మ్యాచ్ల సిరీస్పై ప్రత్యేక దృష్టిసారించింది. అందుకే పలువురు స్టార్ బ్యాటర్లు, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ వన్డే సిరీస్కు దూరంగా ఉండనున్నారు. ఆ సమయాన్ని టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యేందుకు కేటాయించనున్నారు. చహర్ స్థానంలో వస్తున్నాడు.. ఇంతకీ ఎవరీ ఆకాశ్ దీప్? దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న 27 ఏళ్ల ఆల్రౌండర్ ఆకాశ్ దీప్. బెంగాల్ తరఫున 2019 నుంచి ఇప్పటి వరకు మూడు ఫార్మాట్ల(లిస్ట్-ఏ, ఫస్ట్క్లాస్, టీ20)లలో 80 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో కలిపి మొత్తంగా నూట డెబ్బైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 500 పరుగులు సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న ఆకాశ్ దీప్.. ఏడు మ్యాచ్లలో కలిపి ఆరు వికెట్లు తీశాడు. భారత వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఆకాశ్ దీప్. చదవండి: రోహిత్కు బైబై.. ఇక టీమిండియా టీ20 కెప్టెన్గానూ హార్దిక్ పాండ్యా!? -
టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ కారణంగా సౌతాఫ్రికాతో టెస్టులకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా శనివారం దృవీకరించింది. షమీ ఫిట్నెస్పై మెడికల్ టీమ్ ఇంకా క్లియర్స్ ఇవ్వలేదని, అందువల్ల షమీ దక్షిణాఫ్రికు వెల్లడం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా షమీ ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. మోకాలి నొప్పికి అతడు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది. అతడు తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా భారత యువ పేసర్ దీపక్ చాహర్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రోటీస్ పర్యటనకు దూరంగా ఉండాలని చాహర్ నిర్ణయించకున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్తో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీపక్ చాహర్ తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రిని దగ్గరుండి చాహర్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. 🚨 NEWS 🚨 Deepak Chahar withdrawn from the ODI series; Mohd. Shami ruled out of the Test series. Details 🔽 #TeamIndia | #SAvIND https://t.co/WV86L6Cnmt pic.twitter.com/oGdSJk9KLK — BCCI (@BCCI) December 16, 2023 -
Ind vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్లకు టీమిండియా పేసర్ దూరం?
India Tour Of South Africa 2023: టీమిండియా పేసర్ దీపక్ చహర్ సౌతాఫ్రికా పర్యటనలో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి అనారోగ్య కారణాల దృష్ట్యా అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. కాగా గాయాల బెడదతో చాలా కాలం పాటు ఆటకు దూరమైన రైటార్మ్ పేసర్ దీపక్ చహర్.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. కంగారూ జట్టుతో నాలుగో మ్యాచ్కు యువ పేసర్ ముకేశ్ కుమార్ గైర్హాజరు కావడంతో అతడి స్థానంలో దీపక్ ఎంట్రీ ఇచ్చాడు. రాయ్పూర్ మ్యాచ్లో రెండు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఐదో టీ20లో కూడా దీపక్ చహర్ ఆడతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ఆఖరి టీ20కి దూరమయ్యాడని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. తండ్రికి బ్రెయిన్స్ట్రోక్ తాజాగా ఈ విషయం గురించి దీపక్ చహర్ స్పందించాడు. తన తండ్రి లోకేంద్ర సింగ్ శనివారం(డిసెంబరు 2) బ్రెయిన్స్ట్రోక్కు గురయ్యారని.. అందుకే హుటాహుటిన అలీఘర్కు బయల్దేరినట్లు తెలిపాడు. ‘‘సరైన సమయానికి మా నాన్నను ఆస్పత్రికి తీసుకురాగలిగాం. లేదంటే పరిస్థితి విషమించేది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20లో ఎందుకు ఆడలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అన్నింటికంటే మా నాన్నే నాకు ముఖ్యం. ఈరోజు క్రికెటర్గా నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు ఆయనే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను వదిలి నేను ఎక్కడికీ వెళ్లలేను. మా నాన్న అనారోగ్యం పాలైనప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాను. ద్రవిడ్ సర్, సెలక్టర్లతో మాట్లాడాను ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాబట్టి సౌతాఫ్రికాకు పయనమవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ సర్, సెలక్టర్లతో మాట్లాడాను. మా నాన్న ఆరోగ్యం బాగానే ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని దీపక్ చహర్ వెల్లడించాడు. అయితే, డిసెంబరు 10 నుంచే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దీపక్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డే, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీ20 జట్టుకు దీపక్ చహర్ ఎంపికైన విషయం తెలిసిందే. వివాహ వేడుకకు వెళ్లి కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన 31 ఏళ్ల దీపక్ చహర్ తండ్రి లోకేంద్రసింగ్ భారత వైమానిక దళ మాజీ ఉద్యోగి అని సమాచారం. ఆయన బీపీ, షుగర్ పేషంట్. అలీఘర్లో ఓ వివాహ వేడకకు హాజరైన సందర్భంగా పక్షవాతానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు దైనిక్ జాగరణ్ వివరాలు వెల్లడించింది. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
వాల్మీకులు కాంగ్రెస్ వెంటే..
మోసపూరిత హామీలు నమ్మొద్దు
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
రామాయణ కారిడార్ అనుసంధానం చేయాలి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
కాంగ్రెస్ గూటికి మున్సిపల్ వైస్ చైర్మన్
రఘురాముడు గెలిస్తే అభివృద్ధి..
బెయిల్ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement