తెలంగాణలో కరోనా రికవరీ రేటు 87.29 శాతం

11 Oct, 2020 08:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,717 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,12,063కు చేరింది. కరోనా బారిన పడి మరో ఐదుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,222 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. గత 24 గంటల్లో వైరస్‌ బాధితుల్లో 2,103 కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,85,128కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,713 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు 87.29 శాతంగా ఉంది. కాగా.. మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 0.57 శాతానికి తగ్గింది.  (రెమ్‌డెసివిరే ప్రభావశీలి)

మరిన్ని వార్తలు