హైదరాబాద్‌లో ‘మోదీ నో ఎంట్రీ’ ఫ్లెక్సీలు

11 Nov, 2022 02:13 IST|Sakshi
జూబ్లీహిల్స్‌ చౌరస్తాలో మోదీ నో ఎంట్రీ ఫ్లెక్సీ 

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ నగరంలో పలుచోట్ల ‘మోదీ నో ఎంట్రీ’ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ యూత్‌ఫోర్స్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.

దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఆయా చౌరస్తాల్లో ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

మరిన్ని వార్తలు