Video: ఆసక్తికర వీడియోను షేర్‌ చేసిన ఎమ్మెల్సీ కవిత

18 Nov, 2023 10:51 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ట్విట్ట‌ర్‌లో ఆసక్తిక‌ర పోస్టు చేశారు. ఆమె ప్రయాణిస్తున్నదారిలో రోడ్డు ప‌క్క‌న ఆరబోసిన వ‌రి ధాన్య‌పు రాశుల‌ను చూసిన క‌విత‌.. త‌న ఫోన్‌లో చిత్రీక‌రించి, ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

ఎన్నికల ప్రచారారంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత శుక్రవారం నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో.. ఆర్మూర్‌లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టారు. వీటిని చూసి మురిసిపోయిన కవిత.. ఈ దృశ్యాల‌ను తన ఫోన్‌లో చిత్రీకరించారు. “ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుండే తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!” అంటూ రోడ్డు ప‌క్క‌న ఆరబోసిన వ‌రి ధాన్య‌పు రాశుల‌ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.

మరిన్ని వార్తలు