'తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో..' ఇంకేదో కారణంతోనే అంటూ కన్నోళ్ల శోకం!

31 Oct, 2023 09:39 IST|Sakshi

యువతి ఆత్మహత్య!

పలు అనుమానాలకు దారి..

తమ కూతురి మృతిపై విచారణ చేపట్టాలని.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు!

సాక్షి, మెదక్‌: అనుమానాస్పద స్థితిలో ఒక యువతి మృతి చెందిన ఘటన మెదక్‌ మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శివ్వాయిపల్లి చెందిన క్కొల్ల శేఖవ్వ, మల్లేశం రెండో కుమార్తె పావని(21) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో పేర్కొనడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతురి మృతిపై విచారణ చేపట్టాలని సోమవారం పావని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: బీటెక్‌ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు..

మరిన్ని వార్తలు