పెళ్లి బంధంతో ఒక్కటైన మూగ జంట

24 Jun, 2022 14:24 IST|Sakshi
నూతనజంట 

ఖానాపూర్‌: మండలంలోని గోడలపంపు గ్రామానికి చెందిన మూగజంటకు గురువారం వివాహం జరిగింది. గ్రామానికి చెందిన ఆమంద లక్ష్మి–సుదర్శన్‌ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు సుకృత్‌(మూగ)కు నిజామాబాద్‌ జిల్లా రేంజర్ల మండలం ఈరన్నగుట్టకు చెందిన లాస్య(మూగ)తో పట్టణంలోని జేకే ఫంక్షన్‌హాల్‌లో సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. ఈ వివాహానికి పలు జిల్లాల నుంచి మూగ యువతీ, యువకులు హాజరై దంపతులను ఆశీర్వదించారు. 

చదవండి: (రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి)

మరిన్ని వార్తలు