TS: మెడిసిన్‌ చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. కీలక ఉత్తర్వులు జారీ

29 Sep, 2022 14:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మెడిసిస్‌ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వెయ్యికిపైగా ఎంబీబీఎస్‌ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్‌ బీ-కేటగిరి సీట్లలో 85శాతం లోకల్‌ రిజర్వేషన్ల(తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు.

ఇకపై కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్‌ కోటా కింద సీట్లు ఇవ్వనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి హారీష్‌ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130 లను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్-బీ కేట‌గిరీ సీట్ల‌లో కేటాయించే 35శాతం సీట్ల‌లో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థుల‌కే దక్కనున్నాయి. దీంతో, రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థుల‌కే ల‌భించ‌నున్నాయి.

మరిన్ని వార్తలు