కామారెడ్డిలో విషాదం: మంజీరాలో ముగ్గురు గల్లంతు

26 Jun, 2021 09:41 IST|Sakshi

కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దర్గా దర్శనానికి వెళ్లిన నలుగురు మంజీరా నదిలో గల్లంతయ్యారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్గా దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వారిలో తల్లి,  ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి నదిలో గల్లందయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా.. అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

చదవండి: ఈ ఐదక్షరాల శాసనం  వయసు 2,200 ఏళ్లు

మరిన్ని వార్తలు