రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్‌ బాధితులు 

11 Oct, 2022 02:23 IST|Sakshi

దుబాయ్‌ రాయబార కార్యాలయానికి కేటీఆర్‌ లేఖ 

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్‌ ఏజెంట్ల మోసంతో దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకున్న యువకులు రెండు రోజుల్లో స్వగ్రామాలకు రానున్నారు. విమానాశ్రయంలో ఉన్న యువకులకు మంత్రి కేటీఆర్‌ బాసటగా నిలిచారు. దుబాయ్‌లో ఉన్న తెలంగాణకు చెందిన కొందరు మిత్రులను సంప్రదించి.. తన సొంత డబ్బులు వెచ్చించి వారికి వసతులు కల్పించారు.

ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న  గుగులోతు అరవింద్, బర్దిపురం నరేందర్, గొల్లపల్లి రాము, పెద్దొల్ల స్వామి, తిరుమలేశ్,  అనిల్‌కు అక్కడి కంపెనీ ఎగ్జి ట్‌ వీసాలు రెండు రోజుల్లో అందేలా మంత్రి చర్యలు తీసు కున్నారు. దుబాయ్‌ రాయబార కార్యాలయానికి ప్రభు త్వం తరఫున సహాయం కోరుతూ కేటీఆర్‌ లేఖ రాశారు.

మరిన్ని వార్తలు