ఎమ్మెల్యేకు బాల్యం గుర్తొచ్చిందేమో?

9 Jul, 2021 09:01 IST|Sakshi
కొంగోడ్‌ పల్లె ప్రకృతి వనంలో ఉయ్యాల ఊగుతున్న నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

కొల్చారం(నర్సాపూర్‌): ఆయన ఎమ్మెల్యే పల్లె ప్రగతి అభివృద్ధి పనులు పరిశీలించడానికి వచ్చారు. అక్కడ ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలను చూసి ఒక్కసారిగి బాల్యం గుర్తొచ్చిందేమో? ఉయ్యాలలో ఊగి ఆనందపడ్డారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గురువారం కొల్చారం మండలంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు పర్యటించారు. అక్కడ కొంగోడ్‌ గ్రామంలోని పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించి  ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలపై కూర్చుని సరదాగా ఉయ్యాల ఊగి ఆనంద పడ్డారు.                    

మరిన్ని వార్తలు