రెండో రోజు 2.14 లక్షల మందికి కంటి వెలుగు

21 Jan, 2023 02:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజు శుక్రవారం 2.14 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో రెండ్రోజుల్లో 3.81 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లయింది. రెండో రోజు 53,719 మందికి రీడింగ్‌ గ్లాసెస్‌ పంపిణీ చేశారు. 38 వేలమందికి ప్రిస్క్రిప్షన్‌ గ్లాసెస్‌ అవసరమని గుర్తించారు.  కంటి సమస్యలు లేనివారు 1.22 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు