టీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లలో పోలీసుల సోదాలు

31 Oct, 2020 10:01 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట జిల్లా: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం పోలీసులు టీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లలో   సోదాలు చేపట్టారు. ఏక కాలం లో 8 మంది టీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలో సోదాలు చేశారు. వీరితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలో కూడా తనిఖీచేశారు.  దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి , ఎంపీపీ పుష్ప లత కిషన్ రెడ్డి ,  దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు , ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత రాజు , సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి , కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టన పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం వారి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. 


చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే

మరిన్ని వార్తలు