ములుగు జిల్లాలో శిలాజాల గుర్తింపు 

9 Jan, 2022 04:13 IST|Sakshi
శిలాజాలను గుర్తిస్తున్న పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి

కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రం పరిధిలో శిలాజాలు వెలుగులోకి వచ్చాయి. పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఇటీవల గోదావరి నది తీరప్రాంతాల్లో పరిశోధనలు జరిపి ఈ శిలాజాలను గుర్తించారు. శనివారం వాటి వివరాలను వెల్లడించారు. ప్రాచీన కాలంలో భూమిలోపల పొరల్లో కూరుకుపోయిన జంతు కళేబరాలు జల ప్రవాహాల సమయంలో శిలాజాల రూపంలో బయట పడుతుంటాయని తెలిపారు.

వీటిని స్ట్రోమాటోలైట్స్‌ అంటారన్నారు. స్థానికులు గెర్రా అని పిలిచే ఈ ప్రాంతం ప్రాచీనకాలంలో సరస్సుగా ఉండేదని తెలిపారు. వివిధ చారలతో కలిగి ఉన్న రాళ్లు ఆదిమమానవులు వాడిన పరికరాలుగా, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తులను బట్టి పురాతన సరస్సుగా చెప్పవచ్చన్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపితే మరిన్నో విషయాలు వెలుగు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.


శిలాజాలు, వివిధ చారలతో ఉన్న శిలాజం

మరిన్ని వార్తలు