రాజాసింగ్‌కు ‘సుప్రీం’ నోటీసులు 

29 Sep, 2022 03:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో రాజాసింగ్‌ క్రిమినల్‌ కేసులు పొందుపరచలేదంటూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రేమ్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ రవీంద్రభట్, జస్టిస్‌ జేబీ పార్డీవాలా ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న ధర్మాస నం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. నవంబర్‌ 1 లోగా సమాధానం ఇవ్వాలంది. 

మరిన్ని వార్తలు