తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ రిలీవ్.. ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్రం ఉత్తర్వులు

10 Jan, 2023 19:00 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎస్‌  సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేసింది కేంద్రం. గురువారంలోగా ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎస్‌గా సోమేష్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసిన మరునాడే కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్‌కుమార్‌  తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది.
చదవండి: సీఎస్‌ సోమేష్‌కుమార్‌ క్యాడర్‌ కేటాయింపు రద్దు.. టీఎస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు

మరిన్ని వార్తలు