-
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ను రిలీవ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ను రిలీవ్ చేసింది కేంద్రం. గురువారంలోగా ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎస్గా సోమేష్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసిన మరునాడే కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది. చదవండి: సీఎస్ సోమేష్కుమార్ క్యాడర్ కేటాయింపు రద్దు.. టీఎస్ హైకోర్టు కీలక ఆదేశాలు -
డిప్యూటీ డీఈఓలు రిలీవ్
అనంతపురం ఎడ్యుకేషన్ : గుత్తి డిప్యూటీ డీఈఓ చాంద్బాషా, పెనుకొండ డిప్యూటీ డీఈఓ నాగభూషణంలను విధుల నుంచి రిలీవ్ చేశారు. గుత్తి డిప్యూటీ డీఈఓ(ఇన్చార్జ్)గా పని చేస్తున్న పగడాల లక్ష్మీనారాయణ, పెనుకొండ డిప్యూటీ డీఈఓగా పని చేస్తున్న డైట్ అధ్యాపకులు సుబ్బారావును తప్పిస్తూ 2016 డిసెంబరు 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానాల్లో హెచ్ఎంలుగా ఉన్న చాంద్బాషా, నాగభూషణంలను అధికారులు నియమించారు. అయితే తాజాగా ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రçస్తుతం పని చేస్తున్న చాంద్బాషా, నాగభూషణంల నియామక ఉత్తర్వులను రద్దు చేశారు. అంతేకాకుండా గతంలో పని చేసిన పగడాల లక్ష్మీనారాయణ, సుబ్బారావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ గుత్తి డిప్యూటీ డీఈగా గురువారం బాధ్యతలు తీసుకున్నారు. అయితే బోధన వృత్తిలో ఉన్నవారిని డిప్యూటీ డీఈఓగా నియమించకూడదనే నిబంధన అమలులో ఉండడంతో పెనుకొండ డిప్యూటీ డీఈఓగా సుబ్బారావును పునర్ నియమించలేదు. -
ఎస్ఈ శేషారెడ్డిపై బదిలీ వేటు
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఓ ఆండ్ఎం సివిల్ ఎస్ఈగా పనిచేస్తున్న శేషారెడ్డిపై బదిలీ వేటు పడింది. గురువారం ఆర్టీపీపీకి వచ్చి ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ సలహాతో శేషారెడ్డి గురువారం రిలీవ్ అయినట్లు విశ్వసనీయం సమాచారం. 600 మెగావాట్లు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తుండటంతో అధికార పార్టీ వారికి నచ్చక ఎన్ఈని బదిలీ చేయించారని పలువురు చర్చించుకుంటున్నారు. -
తెలంగాణ ప్రాంత విద్యుత్ అధికారుల జంప్
చెప్పాపెట్టకుండా రిలీవ్ కర్నూలు(రాజ్విహార్): కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత విద్యుత్ అధికారులు ఇక్కడి నుంచి జంప్ అయ్యారు. పై అధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండా సొంతంగా రిలీవ్ అయి తెలంగాణ ప్రాంతానికి వెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిలో విద్యుత్ భవన్లో సివిల్ విభాగం ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ కృష్ణారెడ్డితోపాటు ఏఈలు సుధాకర్ (డోన్ రూరల్), నాగరాజు (కోడుమూరు), వెంకటరమణ (ఆదోని కన్స్ట్రక్షన్), ఏఏఓలు శ్రీనివాసులు (ఎస్ఈ కార్యాలయం), వినోద్కుమార్ (కర్నూలు ఈఆర్ఓ), జేఏఓలు స్వప్న (సర్కిల్ కార్యాలయం), సురేష్ (కర్నూలు ఈఆర్ఓ), సబ్ ఇంజినీర్లు సుజాత (విద్యుత్ భవన్లో పర్చేజ్ విభాగం), మహేశ్వర రెడ్డి (పవర్ హౌర్)లు ఈనెల 2వ తేదీ నుంచి విధులకు హాజర కావడం లేదు. ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారం లేకపోవడంతో గైర్హాజర్ (అబ్సెంట్)గా భావిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి అధికారికంగా రిలీవ్ చేసి తెలంగాణకు పంపడంలో జాప్యం జరుగుతుండడంతో వీరంతా చెప్పాపెట్టకుండా వెళ్లినట్లు తెలుస్తోంది. -
జీతాల కోసం న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల ఉద్యోగులు జీతాల కోసం న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నారు. రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్ని కోర్టులో నిలదీయనున్నారు. ఇందులోభాగంగా పిటిషన్ల దాఖలుపై చర్చించేందుకు సోమ, మంగళవారాల్లో భేటీ అయ్యే ఆలోచనలో ఉన్నారు. అయితే స్థానికత అంశం ఇప్పటికే కోర్టులో ఉన్న కారణంగా, జీతాల కోసం కోర్టుకెళ్లడం ఏమేర సాధ్యమనే దానిపై వారు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. స్థానికత ఆధారంగా ఈ నెల 11న తెలంగాణ ప్రభుత్వం 1,251 మంది ఉద్యోగుల్ని రిలీవ్ చేసింది. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఏపీ ట్రాన్స్కో సైతం కోర్టుకెక్కింది. దీంతో రిలీవ్ ఆర్డర్లను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే వీటిని టీఎస్ విద్యుత్ సంస్థలు పట్టించుకోవడం లేదు. ఆ రాష్ట్రం కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఏపీ స్థానికతతో రిలీవ్ అయిన ఉద్యోగుల ఏ రాష్ట్రంలోనూ పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీ వరకే వీరంతా తమ సంస్థల్లో పనిచేసినట్టు తెలంగాణ విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ఈ మేరకే జీతాల పట్టికలో చేర్చాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు గణాంక శాఖను ఆదేశించారు. వచ్చే పది రోజుల వేతనంలోనూ ఆదాయ పన్ను కింద సింహభాగం చెల్లించాల్సి ఉంటుంది. తత్ఫలితంగా ఈ నెల వేతనం అందే అవకాశం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చేసేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోగా తెలంగాణలోనే ఉండి న్యాయపోరాటం చేయాలని చెప్పడంతో వారంతా నలిగిపోతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement