Telangana: కొత్తగా 145 కరోనా కేసులు నమోదు

12 Jun, 2022 01:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 145 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్ప టివరకు రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,94,329కు చేరిం ది. ఇందులో 7,89,241 మంది కోలుకోగా, 977 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతిచెందారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 15,200 మందికి కరోనా పరీక్షలు చేశారు.

ఇందులో 413 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో తాజాగా నమోదైన పా జిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 117 నమోదు కావడం గమనార్హం.  

మరిన్ని వార్తలు