సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం కొత్తగా 614 కరోనా కేసులు నమోదయ్యాయి. 50,520 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 614 మంది వైరస్ బారినపడినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.84 లక్షలకు చేరింది. తాజాగా 2,387 మంది కోలుకోగా, మొత్తం 7.70 లక్షల మంది రికవరీ అయ్యారు.