Vikarabad: టీఆర్‌ఎస్‌ జెండాను ఎత్తుకెళ్లిన దుండగులు

6 Oct, 2021 18:36 IST|Sakshi

సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌ జిల్లా మల్లేమోని గూడలో వెరైటీ దొంగతనం చేసుకుంది. కొందరు దుండగులు టీఆర్ఎస్ జెండాను ఎత్తికెళ్లారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. జెండా కర్రతో పాటు జెండాను ఎత్తుకెళ్లారు దుండగులు. దీని గురించి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దుండగులు కోసం డాగ్‌ స్క్వాడ్‌ని రంగంలోకి దించారు పోలీసులు. కార్యకర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పరిగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: Huzurabad Bypoll: ‘గులాబీ’ దూకుడు

మరిన్ని వార్తలు