తెలంగాణ వర్సిటీ అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తాం: వినోద్‌కుమార్‌ 

24 Sep, 2023 03:13 IST|Sakshi

విద్యార్థుల్ని రాజకీయాలకు దూరంగా ఉంచడంలో కుట్ర దాగుంది 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభు­త్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్‌ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌యూటీఏ) 3వ కన్వెన్షన్‌ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ‘తెలంగాణలో ఉన్నత విద్య– సమకాలీన సమస్యలు – సాధ్యమైన చర్యలు‘ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు వినోద్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వర్సిటీ నిర్మాణాల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగించాలని సూచించారు. వివిధ భావజాలాలతో సంబంధం లేకుండా విద్యార్థులను రా­జ­కీయ భాగస్వామ్యానికి దూరంగా ఉంచడంలో కుట్ర దాగుందని, దీని పర్యవసానాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి మాట్లాడు తూ..పెండింగ్‌లో ఉన్న వర్సిటీ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. 

మరిన్ని వార్తలు