ఎత్తర పేదల జెండా!

11 Nov, 2023 00:46 IST|Sakshi

‘ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే’?(వై ఏపీ నీడ్స్‌ జగన్‌) కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఊరూరా అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ నేతలు సంక్షేమ బోర్డులను ఆవిష్కరిస్తున్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాత్రి అక్కడే బసచేసి గ్రామస్తులతో మమేకమవుతున్నారు. ఆపై సమస్యలు పరిష్కరించి ఇంటికి చేరుకుంటున్నారు. శుక్రవారం ఉదయం వడమాలపేట మండలం, అప్పలాయగుంట సచివాలయ పరిధిలో మంత్రి ఆర్కే రోజా వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలోని కోట మండలం, ఆరూరులో ఎమ్మెల్యే వెలగపల్లె వరప్రసాద్‌రావు, అలాగే చిల్లకూరు మండలంలోని చెడిమాలలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌ పాల్గొని సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి టౌన్‌, బంగారుపేట, బాలాయపల్లెలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాళెం మండలం లింగమనాయుడుపల్లె, బుచ్చినాయుడుకండ్రిగ గ్రామాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజవర్గ పరిధిలోని అమ్మపాళెం గ్రామంలో స్థానిక నేతలు హాజరయ్యారు. తిరుపతి, చంద్రగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో ఆయానియోజకవర్గాల నేతలు పాల్గొన్నారు. – తిరుపతి అర్బన్‌

మరిన్ని వార్తలు