తాటిచెట్లపాలెం : సన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు, సిబ్బందితో కలిసి ఎకో ఫ్రెండ్లీ– గ్రీన్ దీపావళి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశా జాస్తి మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తమ విద్యార్థులు అర్ధం చేసుకుని అనుసరించేలా మన పండగలు, పూజలను సంస్థలో ప్రతి సంవత్సరం విద్యార్థులతో కలిసి నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహమతులు అందజేశారు. సంప్రదాయ వస్త్రధారణ, నృత్యాలతో విద్యార్థులు, సిబ్బంది అబ్బురపరిచారు.