ముగిసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలు

Published Sun, Nov 12 2023 12:34 AM

ప్రథమ స్థానంలో నిలిచిన విశాఖ బాలుర జట్టు - Sakshi

బాలురు, బాలికల విభాగాల్లో విశాఖ, గుంటూరు జట్లు విజేతలు

అరకులోయ టౌన్‌ : ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కంఠబౌంషుగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్‌–14 రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు శనివారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో విశాఖపట్నం జట్టు, ద్వితీయస్థానంలో చిత్తూరు జట్టు, తృతీయస్థానంలో శ్రీకాకుళం జట్టు నిలిచింది. బాలికల విభాగంలో ప్రథమస్థానంలో గుంటూరు జట్టు , ద్వితీయ స్థానంలో విశాఖపట్నం జట్టు, తృతీయ స్థానంలో పశ్చిమ గోదావరి జట్టు నిలిచాయి. విజేతలకు ఇన్‌చార్జీ డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు పతకాలు, ధ్రువపత్రాలు, షీల్డులు అందజేశారు. మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 26 జట్లు పాల్గొన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement