బస్సు, లారీ ఢీ: 20 మందికి గాయాలు

4 Jun, 2014 04:30 IST|Sakshi

విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం పూడి జంక్షన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. బ్రాండిక్స్ కంపెనీకి చెందిన బస్సు రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు స్పందించి పోలీసులకు సమాచారంఅందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



అలాగే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చావలి గ్రామ సమీపంలో లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు