తేనెటీగల దాడిలో ముగ్గురికి గాయాలు

3 Nov, 2015 17:29 IST|Sakshi

డుంబ్రిగూడ (విశాఖపట్నం జిల్లా) : డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ హెడ్ క్వార్టర్‌లో సోమవారం ముగ్గురు వ్యక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. పశువులు కాస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో గొల్లూరి విశ్వనాథం అనే వ్యక్తి పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు