ఆర్టీసీ బస్సు డీసీఎం ఢీ: నలుగురికి తీవ్ర గాయాలు

20 Sep, 2013 08:44 IST|Sakshi

కొహెడ మండలం శనిగరం వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు - డీసీఎం వ్యాన్లు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో డ్రైవర్ సహ ముగ్గురు ట్రైనీ కానిస్టేబుల్స్ గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు