ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య

20 Jul, 2013 15:02 IST|Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న స్వామి స్కూల్ ప్రిన్సిపాల్ మందలించారని మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం జరిగింది.

అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులు గోప్యంగా ఉంచారు. స్వామి మృతి చెందటంతో తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపల్పై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు స్కూల్ యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం కర్నూలులోని ఓ ప్రయివేట్ స్కూలు విద్యార్థి పాఠశాలలోని మూడవ అంతస్థు పైనుండి దూకి మృతి చెందిన విషయం తెలిసిందే.

 ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న రాఘవేంద్ర యాదవ్ (12) అనే విద్యార్థి గురువారం సాయంత్రం 4.15 గంటల సమయంలో పాఠశాలలోని మూడవ అంతస్థు పైనుండి దూకి మృతి చెందాడు. గురువు శిక్షించినందుకు విద్యార్థి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు

మరిన్ని వార్తలు