8 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

24 Dec, 2013 10:19 IST|Sakshi

నెల్లూరు: ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన అటవీశాఖ అధికారులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలం గోలుపల్లి అడువుల్లో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తోన్న వాహనాన్ని మంగళవారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

 

ఆ వాహనంలో తరలిస్తున్న 8లక్షల రూపాయల విలువైన 40ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. టాటా ఏస్ వాహనాన్నిసీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు