కోడెల కుమారుడిపై మరో ఫిర్యాదు

12 Jun, 2019 10:56 IST|Sakshi

సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కోడెల శివప్రసాద్‌ రావు కుమారుడు శివరామ్‌పై మరో ఫిర్యాదు అందింది. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులకు కోడెల కుటుంబంపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే నరసరావుపేట పోలీసుస్టేషన్‌లో కోడెల కుటుంబసభ్యులపై పలు కేసులు నమోదయ్యాయి. కోడెల శివరామ్ రియల్టర్‌ వంశీకృష్ణను బెదిరించి రూ.2.30 కోట్లు వసూలు చేసినట్లు నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. వంశీకృష్ణ కోటప్పకొండ వద్ద 'గ్రీన్ ట్రీ వెంచర్స్' పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. 115 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్‌కు శివరామ్‌.. వంశీకృష్ణ వద్ద 'కేటాక్స్' రూపంలో దాదాపు రూ.2.30 కోట్లు వసూలు చేశారు. డబ్బు ఇవ్వకపోతే పర్మిషన్లు రాకుండా కోడెల కుటుంబం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ ఆధారాలతో సహా నరసరావుపేట డీఎస్పీని ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు