సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2020-21ను ఆ శాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో మంగళవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. గతేడాది కాలంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఆయన శాసనసభలో ప్రసంగిస్తూ.. ‘రైతు సంక్షేమం అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తొస్తారు. రైతుల కోసం నాన్న ఒకడుగు ముందుకేస్తే తాను రెండడుగులు ముందుకేస్తానని చెప్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరణలో చూపుతున్నారు.
ఒత్తిడిలేని వ్యవసాయమే ఆయన సంకల్పం. పెట్టుబడి తగ్గిస్తూ ఉత్పత్తుల నాణ్యతను, రైతుల నికరా ఆదాయాన్ని పెంచడం ద్వారా రైతన్నల ముఖాల్లో సంతృప్తిని చూడటమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తోంది’అని మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ. 29,159.97 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తున్నామని అన్నారు. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.13,500 ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. శాసనమండలిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపులు..
చదవండి: ఏపీ బడ్జెట్ హైలైట్స్