27 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

23 Mar, 2020 04:21 IST|Sakshi

29న బడ్జెట్‌ సమర్పణ

నెల లేదా రెండు నెలల వ్యయానికి ఆమోదం

సాక్షి, అమరావతి: ఈ నెల 27వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆ రోజు ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగంతో ప్రారంభం అవుతాయి.

29వ తేదీన శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2020–21 ఆర్థిక ఏడాదికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం నేపథ్యంలో తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 30వ తేదీన నెల లేదా రెండు నెలల వ్యయానికి సరిపడా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు అసెంబ్లీ నుంచి ఆమోదం పొందనున్నారు.

మరిన్ని వార్తలు