రాయపూడిలో రాజధాని భూముల రభస!

15 Nov, 2014 17:29 IST|Sakshi
రాయపూడిలో రాజధాని భూముల రభస!

గుంటూరు: తుళ్లూరు మండలం రాయపూడిలో రాజధాని భూముల సేకరణపై జరుగుతున్న అభిప్రాయ సేకరణ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అభిప్రాయ సేకరణలో తమను ఎందుకు మాట్లాడనివ్వరని కొందరు రైతులు  తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ అనుచరులు రైతులకు అడ్డు తగిలారు. వారితో వాగ్వాదానికి దిగారు.

 ప్రశ్నించిన రైతులపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు. రైతులు తమ సమస్యలు చెప్పకుండా, వారి కోరికలు తెలియజేయకుండా అడ్డుపడ్డారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను కూడా వారు దుర్భాషలాడారు.
**

మరిన్ని వార్తలు