పోలింగ్‌ బూత్‌లో భూమా నాగ మౌనిక దౌర్జన్యం

24 Aug, 2017 02:26 IST|Sakshi
పోలింగ్‌ బూత్‌లో భూమా నాగ మౌనిక దౌర్జన్యం
వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను భయపెట్టేందుకు విఫలయత్నం
 
నంద్యాల అర్బన్‌ : నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా నాగ మౌనిక పోలింగ్‌ బూత్‌లలో దౌర్జన్యం చేశారు. భారీగా అను చరు లను వెంటే సుకుని వచ్చి ఎన్‌జీఓ కాలనీ పోలింగ్‌ బూత్‌లో దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ రిలీవింగ్‌ ఏజెంట్‌ను బెదిరించడానికి విఫల యత్నం చేశారు. ‘అతన్ని అరెస్ట్‌ చేయండి. మీకు చేతకాకపోతే మా వాళ్లను పంపి సెటిల్‌ చేస్తా’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీ  ఏజెంట్‌పై చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అతను వారి దాడి నుంచి తప్పించుకుని పక్కకు వెళ్లగా ‘వాన్ని పట్టుకోండి రా..’ అని వేలు చూపిస్తూ తన వెంట ఉన్న అనుచరులను ఆదేశించారు. పోలీసులు ఆపేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ‘వాన్ని అరెస్ట్‌ చేయకపోతే నా మనుషులకు నేను సమాధానం చెప్పలేను.. తక్షణమే అరెస్ట్‌ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అంటూ పోలీసులను హెచ్చరించారు.