నెల్లూరులో భారీ చోరీ

3 Jan, 2016 18:28 IST|Sakshi

నెల్లూరు: నెల్లూరు పట్టణంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక పోలీస్ కాలనీలో నివాసం ఉంటున్న మురళీకృష్ణ అనే బ్యాంకు ఉద్యోగి ఇంట్లో శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి రూ.25 లక్షల విలువైన 953 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు