సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో భవనాలను కేటాయిం పును అధికారులు వేగిరం చేశారు. ఏపీకి కేటాయించిన భవనాల్లో మంత్రుల చాంబర్ల కోసం అదనంగా గదులు కేటాయించారు. నార్త్ హెచ్ బ్లాక్లోని రెండో అంతస్తులో పశ్చిమ భాగంలోని అన్ని గదులనూ కేటాయించారు. ఇదే బ్లాక్ లోని 301 నుంచి 306, 335-340, 321-325, 314, 317-319 నంబరు గదులను, జే బ్లాక్లోని 407, 408, 409-424, ఏడో అంతస్తులోని 707, 708, 710, 730, 731, ఎనిమిదో అంతస్తులోని 817-821, ఎల్ బ్లాక్లోని ఏడో అంతస్తులో 703-711 నంబర్ల గదులను మంత్రులు, వారి సహాయకుల కోసం కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.