సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టండి

7 Jul, 2015 01:01 IST|Sakshi

 వైఎస్సార్ సీపీ శ్రేణులకు జగన్ పిలుపు
 కాకినాడ: ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలను, రైతాంగ సమస్యల పరిష్కారంలో వైఫల్యాన్ని ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జెడ్పీ మాజీ చైర్మన్, కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్  చెల్లుబోయిన వేణు సోమవారం హైదరాబాద్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ  క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు అధికార పక్షం నుంచి ఎదురయ్యే దాడులు, ఒత్తిళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలన్నారు. వేణు మాట్లాడుతూ అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు టీడీపీ విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి ఉద్యమానికైనా సన్నద్ధంగా ఉంటామన్నారు.
 

మరిన్ని వార్తలు