తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

23 Nov, 2019 17:15 IST|Sakshi

సాక్షి, తిరుమల : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఏ బోబ్డే శనివారం తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్‌లు ఆయనకు స్వాగతం పలికారు. శనివారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేయనుండగా, ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. 

మరిన్ని వార్తలు