మెడిసిన్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సహవిద్యార్థులు

13 Nov, 2013 17:07 IST|Sakshi
మెడిసిన్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సహవిద్యార్థులు

బెంగళూరు: కర్ణాటకలోని  కోలార్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు  దారుణానికి పాల్పడ్డారు.  మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన విద్యార్థి కామేష్పై సహ విద్యార్థులే పెట్రోల్ పోసి నిప్పంటించారు.   ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.

70 శాతం గాయాలతో కామేష్ బెంగళూరు కింగ్జార్జ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.  కామేష్పై  దాడిచేసింది రాష్ట్ర విద్యార్థులేనని అనుమానిస్తున్నారు. కామేష్ తండ్రి హైకోర్టు అడ్వకేట్ గా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు